

హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కె.టి. రామారావు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో కీలక సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఆయన పలు ముఖ్య దిశానిర్దేశాలు చేశారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా క్షేత్రస్థాయిలో నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు చేయవచ్చని హెచ్చరిస్తూ, అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు నమోదు కాకుండా కట్టుదిట్టమైన నిఘా అవసరమని తెలిపారు. ప్రతి బూత్ స్థాయిలో బూత్ లెవెల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించాలని, కార్పొరేటర్ ఆశావాహులు ప్రజల్లో నిరంతరం ఉంటూ ప్రత్యర్థి పార్టీల విధానాలను బహిర్గతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు, కంటోన్మెంట్ బోర్డ్ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!