
రాజకీయాలు

ప్రజా జీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మనవడితో గడిపిన కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “తాతా.. నువ్వు పూరీలు చేస్తేనే తింటా” అని మనవడు చెప్పడంతో, ముఖ్యమంత్రి స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన “చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
వీడియోలో మనవడిని “ఇంకా కావాలా?” అని అడగగా, “అమ్మమ్మకు, నాన్నకు కూడా కావాలి” అని చిన్నారి క్యూట్గా సమాధానం చెప్పాడు. ఆ చిన్నారి లేచి రావడానికి ప్రయత్నించగా, “లేవొద్దు చిన్నయ్యా.. నేను ఇంకా రెండు మూడు చేస్తా” అంటూ సీఎం ప్రేమగా బుజ్జగించారు. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా కుటుంబ అనుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనంటూ నెటిజన్లు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!