

తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల కోసం ఇన్చార్జ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో సమన్వయం మెరుగుపడుతుందని, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకత్వానికి స్పష్టమైన మార్గనిర్దేశం లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగాయి.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆదిలాబాద్కు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్కు ఉత్తమ్కుమార్ రెడ్డి, మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చేవెళ్లకు శ్రీధర్బాబు, మెదక్కు వివేక్, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావు, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, భువనగిరికి సీతక్క, వరంగల్కు పొంగులేటి, మహబూబ్నగర్కు పొన్నం ప్రభాకర్, జహీరాబాద్కు అజహరుద్దీన్, నాగర్కర్నూల్కు వాకిటి శ్రీహరి, ఖమ్మంకు కొండా సురేఖ లను ఇన్చార్జ్లుగా నియమించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!