
రాజకీయాలు

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ, ఆ హామీని సీజేపీ తిరస్కరించింది. తమ ప్రధాన డిమాండ్లకు ఈ నిర్ణయం సరిపోదని పార్టీ నేతలు పేర్కొన్నారు.
ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన విరమించబోమని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, నిరసనకారులకు మద్దతుగా పలువురు స్విగ్గీ, జొమాటో ద్వారా ఆహారాన్ని పంపిస్తూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!