

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నారు. మొత్తం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందిస్తూ, ఏకీకృత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు.1995లో తెలుగు దేశం పార్టీలో జరిగిన అంతర్గత మార్పుల తరువాత చంద్రబాబు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరవాత వెనక్కి చూసే పని లేదు. మూడు సార్లు ప్రజల ఆశీర్వాదంతో సీఎం పదవిని చేపట్టిన ఆయన, తాజా పదవీకాలం 2024లో ప్రారంభమైంది.
దక్షిణ భారతదేశంలో కేవలం కరుణానిధి, రంగస్వామి వంటి నేతలే 15 ఏళ్లకు పైగా సీఎం గా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన పరిపాలనా నైపుణ్యం, దూరదృష్టి రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తోంది.ఇప్పుడు ఎంఎల్ఏగా 15 ఏళ్లు కొనసాగడం కూడా కష్టమైన సమయంలో, సీఎం గా 15 సంవత్సరాలు పూర్తి చేయడం చంద్రబాబు యొక్క రాజకీయ శక్తి, ప్రజా విశ్వాసానికి నిదర్శనం. ఈ పదవీకాలం ముగిసే సమయానికి ఆయన మొత్తం 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు — ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రికార్డు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!