
జనరల్

ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునఃప్రారంభం కోసం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వెళ్లనున్న ఈ బృందం, కేంద్ర ప్రభుత్వ దృష్టికి సీసీఐ పునరుద్ధరణ అంశాన్ని తీసుకెళ్లనుంది.
సీసీఐ సాధన కమిటీ సభ్యులతో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు. ఆదిలాబాద్లో మూతపడిన సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!