
సినిమాలు

తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ గురించి కోలీవుడ్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, త్వరలోనే హీరోగా కూడా వెండితెరపై కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
'సిగ్మా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన జేసన్ సంజయ్ను హీరోగా పరిచయం చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 'పరి మాలా అండ్ కో' నిర్మాత తమిళ్కుమరన్ ఈ ప్రాజెక్ట్ను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై జేసన్ సంజయ్ లేదా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. విజయ్ అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (1)
Hi