

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’పై సినీ వర్గాల్లో భారీ చర్చ కొనసాగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.800 కోట్లకు పైగా ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ చిత్రానికి అల్లు అర్జున్ దాదాపు రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు కూడా హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ బడ్జెట్, పారితోషికానికి సంబంధించి చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక ఈ చిత్రంలో దీపికా పడుకోణె కథానాయికగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పాన్-ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయంగా కూడా ఈ గ్లింప్స్కు విశేష స్పందన లభించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. నటీనటులు, విడుదల తేదీతో పాటు ఇతర వివరాలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!