
జనరల్

ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 శాతం టోల్ విధించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే చమురు రవాణా వ్యయం గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంచనాల ప్రకారం పూర్తిగా లోడ్ చేసిన ఒక్కో చమురు సూపర్ ట్యాంకర్ నుంచి సుమారు 30 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.287 కోట్లు) వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పాటు ఇంధన ధరలు, రవాణా వ్యయం, ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!