
సినిమాలు

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు పరోక్షంగా సహకరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, సుప్రీంకోర్టు కనీసం నోటీసులు జారీ చేయడానికి కూడా నిరాకరించిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు కవిత సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను ప్రజలు క్షమించరని అన్నారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గోదావరి జలాలను అప్పగిస్తున్నారని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలిస్తే ఏపీకి ఎంతమేర సహకారం అందుతోందో అర్థమవుతుందని ఆమె ఆరోపించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!