
జనరల్

తుంగభద్ర నదీ పరీవాహక రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి కేంద్ర జల సంఘం (CWC) సభ్యుడు ఛైర్మన్గా వ్యవహరించనుండగా, తుంగభద్ర బోర్డు ప్రతినిధులు, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ కమిటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీర్-ఇన్-చీఫ్లకు కూడా స్థానం కల్పించారు. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటి పంపిణీ, జలవనరుల నిర్వహణ, మౌలిక సదుపాయాల అంశాలు సహా పలు కీలక అంశాలను పరిశీలించి సమగ్ర నివేదికను ఆరు నెలల్లో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!