

సినిమా పరిశ్రమను చాలా కాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైన కొద్ది గంటల్లోనే అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్లలో ప్రత్యక్షమవడం వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. ఈ సమస్యను అరికట్టేందుకు సినీ పరిశ్రమ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
అయితే తాజాగా విడుదలైన 'లెనిన్' సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సినిమా విడుదలైన తొలి రోజుల్లో పెద్దగా పైరసీకి సంబంధించిన సమాచారం బయటకు రాకపోవడంతో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దీనికి నిర్మాత నాగ వంశీ అనుసరించిన వ్యూహమే కారణమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ గల్ఫ్ దేశాలకు పంపే కాపీల నుంచే ఎక్కువగా పైరసీ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 'లెనిన్' చిత్రాన్ని యూఏఈలో విడుదల చేయకపోవడంతో పాటు అక్కడి సెన్సార్కు కూడా పంపలేదని సమాచారం. దీంతో సినిమా కాపీ లీక్ అయ్యే అవకాశాలు తగ్గాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యూహం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!