

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం. రానున్న 10 నుంచి 15 రోజుల్లో ఈ పర్యటన జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి మోదీ టూర్, ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే సమయంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ పాల్గొననుండగా, తెలంగాణ పర్యటనను కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఎయిమ్స్ బీబీనగర్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అలాగే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం స్థానిక నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది.







.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!