
సినిమాలు

తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 11న ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వారి ఇళ్ల వద్దకు వస్తానని, 2020లో తనపై నమోదైన కేసుల వివరాలను కూడా తీసుకొస్తానని ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గోరంట్ల మాధవ్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆయన విమర్శించారు.
తనపై నమోదైన కేసుల్లో వ్యక్తులు వేర్వేరైనా, కేసుల తీరు మాత్రం ఒకే విధంగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!