
జనరల్

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తైన తర్వాత రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. వీరిలో 2,64,87,214 మంది (78.30%) ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. మరో 73,39,234 మంది (21.70%) ఫారాలను సేకరించలేకపోయినట్లు అధికారులు తెలిపారు.
ఫారాలు సేకరించలేకపోయిన వారిలో 9,22,230 మంది మరణించినట్లు, 11,25,546 మంది ఆచూకీ లభించలేదని, 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు వెల్లడించారు. మరో 6,70,203 మంది ఇప్పటికే నమోదైన ఓటర్లుగా, 1,02,294 మందిని ఇతర కేటగిరీల్లో గుర్తించినట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!