
జనరల్

పశ్చిమ బెంగాల్లోని హాలిశహర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్పై దాడి జరిగినట్లు సమాచారం. ఇటీవల పోలీసు కస్టడీలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
కార్యకర్త మృతి ఘటన ఇప్పటికే రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాన్వాయ్పై దాడి జరగడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!