

బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. “రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయి” అనే ఆయన వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతోంది.
ఇటీవల మీర్జాగూడ బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నాణ్యత, మరమ్మతులపై చర్చ సాగుతుండగా, తాండూరు ప్రజలు హైదరాబాద్–తాండూర్ జాతీయ రహదారిని వెంటనే కొత్తగా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆ మార్గంలో తరచూ జరిగే ప్రమాదాల వల్ల సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. రోడ్లు సరిగ్గా ఉంటే డ్రైవర్లు వేగంగా నడిపి ప్రమాదాలకు గురవుతారని, కానీ గుంతలతో ఉన్న రోడ్లు ఉంటే వాహనాలు నెమ్మదిగా నడుస్తాయని ఆయన పేర్కొన్నారని సమాచారం.
అయితే ఈ వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. రోడ్లపై గుంతలే ప్రమాదాలకు ప్రధాన కారణమని, ముఖ్యంగా రాత్రి సమయంలో అవి కనబడక పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని నెటిజన్లు గుర్తు చేశారు. ప్రజాప్రతినిధిగా, బాధ్యత గల నేతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసమంజసమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివరణ ఇస్తారా, లేక తన మాటలకే కట్టుబడి ఉంటారా అన్నది చూడాలి. కానీ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్కు టాపిక్గా మారాయి.











.avif&w=3840&q=75)




కామెంట్స్ (1)
Good roads are a blessing, not a danger!