

విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అదానీ పోర్ట్స్ & SEZ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక గుర్తింపును తీసుకువస్తున్నాయని తెలిపారు.
పాలనలో పారదర్శకత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, డిజిటల్ రిఫార్మ్స్ వంటి అంశాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయని పలువురు విదేశీ, దేశీయ ప్రతినిధులు పేర్కొన్నారు.
సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీ కాలంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన జీనోమ్ వ్యాలీ ఆలోచన, కోవిడ్ సమయంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అభివృద్ధికి కీలకంగా మారిందని గుర్తుచేశారు.
జీఎమ్మార్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు కూడా దీర్ఘకాల ప్రణాళికలు, స్థిరమైన విధానాల అవసరాన్ని ప్రస్తావించారు.
సదస్సు నిర్వాహకుల సమాచారం ప్రకారం, తొలి రోజునే 40 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ప్రతిపాదిత పెట్టుబడుల విలువ సుమారు ₹3.5 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.
అయితే, ఈ ఒప్పందాలు గ్రౌండ్ లెవెల్లో అమలు అవ్వడం ముఖ్యమని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను విస్తరించే దిశలో చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు వివరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!