

అభిజిత్ దీప్కే తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) ఎక్స్ అకౌంట్ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ భద్రత పేరిట తమ అకౌంట్ను స్తంభింపజేయడం చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. అభిజిత్ తరపున అడ్వకేట్ నకుల్ గాంధీ ఈ పిటిషన్ దాఖలు చేయగా, ఈ వారంలోనే కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సీజీపీ అకౌంట్ జాతీయ భద్రతకు ముప్పుగా మారవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎక్స్ సంస్థ అకౌంట్ను బ్లాక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. గత నెలలో రాజకీయ సెటైర్గా ప్రారంభమైన సీజీపీ ఉద్యమం యువతలో భారీ ఆదరణ పొందింది. ఎక్స్లో వేలాది ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!