
సినిమాలు

నాలుగేళ్ల క్రితం విడుదలై మంచి ఆదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వదంది’ ఇప్పుడు కొత్త సీజన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘వదంది: ది మిస్టరీ ఆఫ్ మణి’ పేరుతో రూపొందిన ఈ సీజన్ పూర్తిగా కొత్త కథ, కొత్త పాత్రలతో తెరకెక్కింది. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సీజన్లో శశికుమార్ కీలక పాత్ర పోషించగా, ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు పుష్కర్–గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఓ ఎస్సై చేసిన పొరపాటు కారణంగా అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తాడు. తన తప్పును గ్రహించిన ఆ పోలీసు అధికారి నిజాన్ని బయటపెట్టి అతడికి న్యాయం ఎలా చేశాడన్నదే ఈ ఉత్కంఠభరితమైన కథలో ప్రధాన అంశం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!