
రాజకీయాలు

నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రం మే 22న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకోగా, నేటి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రణవ్ స్వరూప్ దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ రాజా, రవితేజ మహాదాస్యం కీలక పాత్రల్లో నటించారు. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!