

ఆహా ఒరిజినల్స్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” సీజన్ 2 స్ట్రీమింగ్కు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, గర్ల్స్ గ్యాంగ్ కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన “4 మోర్ షాట్స్ ప్లీజ్” తరహా వైబ్తో, స్వేచ్ఛగా జీవించే ముగ్గురు అమ్మాయిల స్నేహం, ఆశయాలు, జీవిత ప్రయాణాన్ని ఆసక్తికరంగా చూపిస్తోంది.
లవ్, కెరీర్, పర్సనల్ స్పేస్ కోసం ప్రయత్నించే నేటి తరం తెలుగు అమ్మాయిల లైఫ్ను ఈ సీజన్ రియలిస్టిక్గా ప్రతిబింబిస్తోంది. సంప్రదాయాల్ని దాటిన ఆలోచనలు, విమర్శలను లెక్కచేయని ధైర్యం, తమదైన మార్గంలో ముందుకు సాగే తీరు ప్రేక్షకులను కనెక్ట్ చేస్తోంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సిరీస్కు మారుతి షో రన్నర్గా వ్యవహరించగా, రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా, కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!