

ప్రేమమ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మలయాళ నటుడు నివిన్ పౌలీ ఇప్పుడు ప్రతిఛాయ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రాజకీయ నేపథ్య కథ గత నెల 26వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే సాధారణ కథలా అనిపించడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాను త్వరలోనే ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా వచ్చే శుక్రవారం అంటే ఈ నెల 24వ తేదీ నుంచి డిజిటల్ వేదిక హాట్స్టార్లో ప్రసారం కానుంది. తెలుగులో కూడా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే త్వరలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కథ విషయానికొస్తే కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వర్గీస్ నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఒక మహిళ అతనిపై ఆరోపణలు చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేస్తాడు. ఈ విషయంపై నిజం బయటపెట్టాలని అతని పెద్ద కొడుకు జాన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎదుర్కొనే సమస్యలు, నిజాలు ఏమిటి అనేదే మిగతా కథ.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!