

సూర్య ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పు, తెలుగులో వీర భద్రుడు పేరుతో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. కథలోని ఆసక్తికర మలుపులు, ప్రత్యేక రిఫరెన్స్లు రెండు భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్ నటుడు ఆర్య ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించినప్పటికీ, ఆయనకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తుది వెర్షన్లో కనిపించలేదని సమాచారం.
చిత్ర ఎడిటర్ ఆర్. కలైవనన్ వెల్లడించిన వివరాల ప్రకారం, సినిమా నిడివిని నియంత్రించేందుకు ఆర్య సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందట. కథకు అవి ఉపయోగపడినా, మొత్తం చిత్ర ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆ సన్నివేశాలను పూర్తిగా పక్కన పెట్టలేదని, డిజిటల్ విడుదల సమయంలో అదనపు కంటెంట్ రూపంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడంతో, ఓటీటీ వెర్షన్లో ప్రేక్షకులకు కొత్త సర్ప్రైజ్లు ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!