
జనరల్

ఫుట్బాల్ అభిమానుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, భారత్లో ఫిఫా ప్రపంచకప్ ప్రసార హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. ఈ ఒప్పందం సుమారు రూ.320 కోట్ల విలువతో కుదిరినట్లు సమాచారం.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు అర్ధరాత్రి తర్వాత ప్రారంభం కానుండటంతో పలు ప్రధాన ప్రసార సంస్థలు ఈ హక్కుల పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీ గ్రూప్ హక్కులను దక్కించుకుంది. ప్రపంచకప్ పోటీలను తమ నాలుగు కొత్త క్రీడా చానెళ్లతో పాటు జీ 5 వేదిక ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!