

కర్నూలు నగర సమీపంలోని పంచలింగాల చెక్పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు నెలల గర్భిణి మృతి చెందింది. అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాద సమయంలో రాముడు తన కుమార్తె ప్రియాంకను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఈ క్రమంలో బస్సు ప్రియాంకపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రాముడు తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా గడివేములకు చెందిన ప్రియాంకకు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మద్దూరు గ్రామానికి చెందిన బజారితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. కాన్పు కోసం తండ్రి రాముడు ఆమెను పుట్టింటికి తీసుకెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!