

పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్ తరగతి ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన ఈ స్పేస్ టెక్ సంస్థ సాధించిన ఈ ఘనత దేశం అంతరిక్ష సాంకేతిక రంగంలో పెరుగుతున్న సామర్థ్యానికి నిదర్శనమని ప్రశంసించారు.
ఈ సందర్భంగా, భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన స్కైరూట్కు సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శంషాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో ఉన్న స్కైరూట్ మ్యాక్స్ క్యూ క్యాంపస్ను గతంలో సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం తెలంగాణను గ్లోబల్ ఏరోస్పేస్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. ఈ విజయం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి యువతలో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచుతుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!