
జనరల్

గురుకుల పాఠశాలలకు చెందిన నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎంసీఆర్హెచ్ఆర్డీ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటు తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవల్లిక కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ గురుకుల విద్యాసంస్థల విద్యార్థుల ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీట్ ర్యాంకర్లను అభినందిస్తూ, మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవల్లికను ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సామాజిక సంక్షేమ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి కంభంపాటి శారద, సంయుక్త కార్యదర్శి సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!