
క్రీడలు

రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్తీ పాలు సేవించడం వల్ల ఐదుగురు మరణించడం, మరికొందరు అస్వస్థతకు గురికావడం ఎంతో విషాదకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. అవసరమైతే ప్రత్యేక నిపుణుల బృందాలను నియమించి బాధితులకు సమగ్ర వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ వెంటనే స్పందించాలని ఆయన అన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!