
టెక్నాలజీ

ఎల్బీ నగర్లోని ఆర్కేపురం చట్నీస్ హోటల్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి తీవ్ర కలకలం రేపింది. భారీ శబ్దం వినిపించడంతో అక్కడున్న వినియోగదారులు భయంతో బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కిచెన్లోని ఇడ్లీ స్టీమర్ నుంచి పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడి కారణంగా స్టీమర్ పేలిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా, ఇతర కారణాలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు, హైడ్రా అధికారులు, బాంబు స్క్వాడ్ బృందాలు కిచెన్ను పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!