

లోక్సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాతో భారత్కు ఉన్న లోతైన వ్యాపార సంబంధాలను ప్రస్తావిస్తూ, దేశ ఇంధన అవసరాలను ఆ ప్రాంతం ప్రధానంగా తీర్చుతోందని తెలిపారు. అంతేకాకుండా, యుద్ధం ఎప్పటికైనా సాధారణ ప్రజలపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారని పేర్కొన్న ప్రధాని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇప్పటివరకు సుమారు 3.75 లక్షల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న ప్రతి భారతీయుడి రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.















.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!