

ప్రపంచ దేశాలపై మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థ ఫిబ్రవరి 24 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి ఆ టారిఫ్ల వసూళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (IEEPA) కింద విధించిన ఈ సుంకాలపై ఇప్పటికే దిగుమతిదారులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్లను తిరిగి చెల్లిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. అత్యవసర అధికారాలను వినియోగించి ప్రతీకార సుంకాలు విధించడం సరైంది కాదని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ట్రంప్ ప్రపంచ దిగుమతులపై 15 శాతం కొత్త టారిఫ్లను ప్రకటించినప్పటికీ, ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్పై విధించిన సుంకాలు 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గినట్లు సమాచారం.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!