
సినిమాలు
.jpeg&w=3840&q=75)
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా భారీ దాడి చేసింది. భూగర్భంలో నిర్మించిన ఇరాన్ క్షిపణి స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, లోతుగా చొచ్చుకుపోయే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో ఈ దాడి చేపట్టింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన ప్రకారం, ఇరాన్ తీర ప్రాంతంలో పటిష్టంగా నిర్మించిన క్షిపణి కేంద్రంపై 5,000 పౌండ్ల బాంబులతో దాడి జరిగింది. ఈ కేంద్రం అంతర్జాతీయ నౌకా రవాణాకు ముప్పుగా మారిందని పేర్కొంటూ, ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!