

లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ను అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ కోరారు. గత ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడితో ఈ ముఠాలకు సంబంధం ఉన్నట్లు ఆయన ఆరోపించారు. భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన “హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెరరిజం” ప్రదర్శనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా షెర్మన్ మాట్లాడుతూ అమాయక ప్రజలను మత ఆధారంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దారుణమని అన్నారు. పాకిస్తాన్కు సంబంధించి ఈ ఉగ్ర సంస్థలను అణచివేయాలని ప్రపంచం మొత్తం కలిసి డిమాండ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ డిజిటల్ ప్రదర్శనలో 1993 ముంబయి బాంబు పేలుళ్లు, 2008 ముంబయి ఉగ్రదాడి, అలాగే పహల్గాం ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రదర్శించారు. అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడుతూ ఉగ్రవాదం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, ప్రపంచ దేశాలు ఐకమత్యంతో కలిసి దీనిని అంతం చేయాలని అన్నారు.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!