

ఐబొమ్మ రవిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో రవి పూర్తిగా సహకరించడం లేదన్న సమాచారం వెలువడుతోంది. సోమవారం నాటికి అతని ఐదు రోజుల కస్టడీ గడువు ముగియనుంది.
విచారణలో భాగంగా రవి వ్యక్తిగత వివరాలకతీతంగా పైరసీ కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వెల్లడించకుండా ఉంటున్నాడని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా మరోసారి కస్టడీ పొడిగింపుపై పోలీసులు పరిశీలిస్తున్నారు.
సినిమాలపై ఆసక్తితోనే తన చర్యలు జరిగాయని రవి చెప్పినట్లు సమాచారం. లగ్జరీ జీవనశైలికి అలవాటు పడిన ఆయన విదేశాల్లో విస్తృతంగా ప్రయాణించినట్లు కూడా తెలుస్తోంది. రవి వద్ద ఉన్న ఆస్తులు, ఆదాయ వనరులపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. అతని బ్యాంకు లావాదేవీల వివరాలను తెలుసుకోవడానికి సంబంధిత బ్యాంకులకు లేఖలు రాశారు.
ఈ కేసులో సైబర్ క్రైమ్తో పాటు సీఐడీ అధికారులు కూడా దర్యాప్తులో భాగస్వామ్యం కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!