

తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను సవరించింది. ప్రాంతాల వారీగా భూముల ధరలను 50 శాతం నుంచి 100 శాతం వరకు పెంచుతూ కొత్త మార్గదర్శక విలువలను అమల్లోకి తీసుకువచ్చింది. వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, వాణిజ్య ఆస్తులపై ఈ పెంపు వర్తించనుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు మరియు ప్రైమ్ ఏరియాల్లో అధికంగా ధరలు పెరిగాయి.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ప్రైమ్ ఏరియాల్లో భూముల మార్కెట్ విలువలను 100 శాతం వరకు పెంచగా, ఇతర ప్రాంతాల్లో 50 నుంచి 75 శాతం వరకు పెంపు అమలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని మంత్రి స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!