
న్యూస్

మెక్సికోలో మరో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరికి చెందిన వెంకట ధర్మరావు జుయారెజ్ నగరంలో నివసిస్తూ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అతను నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సహచరులు అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించగా నోటి నుంచి నురుగు రావడం గమనించినట్లు సమాచారం. అయితే మృతికి గల కారణం ఇంకా వెల్లడికాలేదు. సహచరులు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు తెలుసుకోలేక ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల అనుమానాస్పద మరణాలపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.











.jpeg&w=3840&q=75)
.jpg&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!