
సినిమాలు

తిరుమలలో లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు సంబంధించిన ఈ అంశంపై దర్యాప్తు కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సమగ్ర విచారణ చేపట్టి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లను ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సిఫార్సులు చేయాలని సూచించింది. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!