

ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా 2025 డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ ప్రత్యేక ఈవెంట్కి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యాహ్నం 4 గంటల నుంచి 4:30 గంటల మధ్య శంషాబాద్ RGIA విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అనంతరం సాయంత్రం 5 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్లో ప్రైవేట్ మీట్ అండ్ గ్రీట్లో పాల్గొననున్నారు.
స్టేడియం కార్యక్రమాలు సాయంత్రం 5:30 గంటల నుంచే ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 నుంచి 7:30 మధ్య మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుని లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్తో కలిసి పరేడ్లో పాల్గొననున్నారు. 7:30 గంటలకు ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రారంభమవుతుండగా, చివరి 5 నుంచి 10 నిమిషాలు మెస్సీ మైదానంలో ఆడే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 7:50 గంటలకు ‘గోట్ కప్’ పెనాల్టీ షూటౌట్, 8 గంటలకు ఎంపికైన 24 మంది పిల్లలతో ఫుట్బాల్ క్లినిక్ నిర్వహించనున్నారు. చివరగా 8:30 గంటలకు సత్కార కార్యక్రమంతో ఈ వేడుక ముగియనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆన్లైన్ పాస్లు ఉన్నవారికే ప్రవేశం ఉండగా, ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు.


.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!