
న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపుపై పౌరసరఫరాల సంస్థ భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాలు & నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్యాస్ సరఫరాను కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
గత నెలలో నిర్వహించిన దాడుల్లో 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, 70 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.1.50 కోట్లు. ఈ కేసుల్లో 2,089 కేసులు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపు లేదా డెలివరీలో జాప్యం ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.











_1775900374811.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!