
న్యూస్
ఈ ఏడాది గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీని లక్ష్యంగా ఉగ్రవాద సంస్థలు దాడులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఖలిస్థానీ మరియు బంగ్లాదేశ్ కేంద్రిత ఉగ్ర సమూహాలు రిపబ్లిక్ డే సందర్భంగా దిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా దాడులను ప్రయత్నించవచ్చని హెచ్చరించారు.
దేశీయ భద్రతను భంగం చేయడానికి ఈ ఉగ్రవాదులు స్థానిక గ్యాంగ్స్టర్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. హరియాణా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ లో ఉగ్ర నెట్వర్క్ విస్తరిస్తోందని నిఘా వర్గాలు తెలిపారు. గతేడాది దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనను దృష్టిలో ఉంచుకుని, అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సహా ఇతర ప్రధాన నగరాల్లో భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!