

బిగ్బాస్ ఫేం గీతూ రాయల్ తిరుమలలో చేసిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. స్నేహితులతో కలిసి కొండ పై సినిమా పాటకు రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గీతూ రాయల్ మరియు మరో నలుగురు యువకులు శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్కు వెళ్లే మార్గం, ఘాట్ రోడ్లలో వీడియోలు చిత్రీకరించినట్లు సమాచారం. ఈ వీడియోలు ఆన్లైన్లో వైరల్ కావడంతో పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొండ పై రీల్స్, వీడియోల చిత్రీకరణను తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ఇప్పటికే నిషేధించింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని అధికారులు పునరుద్ఘాటించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనల పై కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఈ వివాదం పై గీతూ రాయల్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తనపై చర్యలు తీసుకుంటారని విన్నానని, చిన్న విషయాన్ని పెద్దగా చేశారని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరింత వివాదాస్పదంగా మారింది.
నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో గీతూ రాయల్ మరియు ఆమె బృందంపై కఠిన చర్యలు తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!