

హైదరాబాద్లోని చందానగర్ ప్రాంతంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆశీర్వాదంతో కాంగ్రెస్ నాయకుడు, యువ నాయకుడు రామచంద్ర రాజు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని చిరు వ్యాపారులకు వారి ఉపాధి అభివృద్ధి కోసం తోపుడుబండ్లు, వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. అలాగే రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన వారికి గొడుగులు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రామచంద్ర రాజు, తన పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తోందని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆశీర్వాదంతో పేదలకు ఉపాధికి ఉపయోగపడే తోపుడుబండ్లు, వీల్ చైర్స్ మరియు వేసవిలో ఉపయోగపడే గొడుగులు పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా రామచంద్ర రాజు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!