
జనరల్

దుబాయ్లో ఉన్న ఒక వ్యక్తిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ సుభానీ అనే యువకుడు ఓ యువతిని గతంలో పరిచయం చేసుకుని, సన్నిహిత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. యువతి వివాహం అయిన తర్వాత ఆమెను వేధించడం ప్రారంభించాడు. వీడియో కాల్స్ చేయాలని, లేకపోతే ఫొటోలు బంధువులకు పంపిస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అతను యువతి భర్తకు కూడా అసభ్య ఫొటోలు పంపించగా, భర్త నంబర్ బ్లాక్ చేశారు. అయినా వేర్వేరు నంబర్లతో వేధింపులు కొనసాగించాడు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి నగ్న చిత్రాలు పంపుతానని డబ్బు, బంగారం ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో నిందితుడు దుబాయ్లో ఉన్నట్లు గుర్తించారు. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!