

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అదేవిధంగా ఈ నెల 19వ తేదీ తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అది అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ పరిణామాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 25 నుంచి 28 తేదీల మధ్య తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇక రెండు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత తగ్గుముఖం పడుతోంది. మహాశివరాత్రి తర్వాత చలి తగ్గుతుందని పెద్దలు చెప్పే మాటకు అనుగుణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం వేళ కొద్దిగా చల్లగా ఉన్నప్పటికీ, మధ్యాహ్న సమయంలో ఎండలు తీవ్రంగా ఉండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారంనుంచే ఈసారి వేసవి తీవ్రంగా ఉండే అవకాశముందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!