
నేపాల్ (Nepal) లో సాధారణ ఎన్నికల (General Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జనం ఉదయం నుంచే బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడి రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమతమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. ఈ మధ్యాహ్నం నేపాల్ మాజీ ప్రధాని (Nepal Ex PM) కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) ఓటువేశారు.
భక్తాపూర్లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఓలి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన జన్ జడ్ (Gen Z) ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో 77 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఓలి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – యూనిఫైడ్ మార్క్సిస్ట్, లెనినిస్ట్ (CPN-UML) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!