

అధునాతన కృత్రిమ మేధస్సు (AI) యాక్సెలరేటర్ చిప్లను డిజైన్ చేసే స్టార్టప్ గ్రోక్కు చెందిన కీలక ఆస్తులను కొనుగోలు చేయాలని అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియా నిర్ణయించింది. ఈ ఒప్పందం ద్వారా తమ ఏఐ ఉత్పత్తులు మరింత బలోపేతం అవుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హ్యువాంగ్ తెలిపారు. సీఎన్బీసీ కథనం ప్రకారం, ఈ డీల్ విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.8 లక్షల కోట్లు)గా ఉండనుండగా, మొత్తం నగదు రూపంలోనే లావాదేవీ జరగనుంది.
గ్రోక్ ఈ విక్రయానికి స్వయంగా ముందుకు రాకపోయినప్పటికీ, ఒప్పందం వేగంగా కుదిరిందని డిస్ట్రప్టివ్ సీఈఓ అలెక్స్ డేవిస్ వెల్లడించారు. గ్రోక్కు చెందిన క్లౌడ్ వ్యాపారాన్ని మినహాయించి మిగతా అన్ని ఆస్తులను ఎన్విడియా కొనుగోలు చేయనుందని ఆయన తెలిపారు. గత మూడు నెలల క్రితం గ్రోక్ 6.9 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువతో 750 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. ఈ పెట్టుబడుల్లో బ్లాక్రాక్, శాంసంగ్, సిస్కో, ఆల్టిమీటర్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భాగస్వామిగా ఉన్న 1789 క్యాపిటల్ పాల్గొన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!