
సినిమాలు

హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రజల భద్రత దృష్ట్యా కీలక హెచ్చరిక జారీ చేశారు. మెట్రో స్టేషన్లు, రైలు పట్టాల సమీపంలో గాలిపటాలు ఎగరవేయవద్దని స్పష్టంగా సూచించారు. ముఖ్యంగా మాంజా పూత ఉన్న గాలిపటాల దారాలు మెట్రో విద్యుత్ తీగలకు తగిలితే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మెట్రో అధికారులు తెలిపారు.
ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మెట్రో యాజమాన్యం, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి నిబంధనలు పాటించాలని కోరింది. మెట్రో పరిసరాల్లో ప్రమాదకర కార్యకలాపాలను నివారిస్తూ, సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు సహకరించాలని హైదరాబాద్ మెట్రో విజ్ఞప్తి చేసింది.








.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!