
న్యూస్

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త ఆంక్షలు విధించారు. ఈ నెల 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో కొత్త ట్రాఫిక్ నియమాలను పరీక్షించనున్నారు. రోడ్లపై రద్దీ తగ్గించి వాహనాల రాకపోకలను సులభం చేయడమే లక్ష్యంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆదివారం నుంచి వాహనాలకు వన్ వే మార్గాలు అమలు చేయనున్నారు. పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలు రోడ్ నంబర్ 2 ద్వారా మాత్రమే వెళ్లాలి. అలాగే రోడ్ నంబర్ 45 నుంచి పంజాగుట్ట వెళ్లే వాహనాలు చెక్ పోస్టు, కేబీఆర్ పార్క్ మార్గం ద్వారా రోడ్ నంబర్ 2 వైపు వెళ్లాలి. ట్రయల్ రన్ విజయవంతమైతే ఇదే మార్గాలను శాశ్వతంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!