

డిజిటల్ మరియు సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఆర్బీఐ తీసుకున్న కీలక చర్య నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం, డిజిటల్ చెల్లింపులు చేయాలంటే కేవలం పిన్ నంబర్ నమోదు చేయడం సరిపోదు. అదనంగా బ్యాంక్ ద్వారా ఎస్ఎంఎస్గా వచ్చే ఓటీపీ లేదా ఫింగర్ప్రింట్ లేదా ఫేసియల్ గుర్తింపు వంటి అదనపు ధృవీకరణ కూడా అవసరం.
ఈ నియమం యూపీఐ, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ పరికరాల ద్వారా జరిగే అన్ని చెల్లింపులకు వర్తిస్తుంది. ఈ మార్పుల కారణంగా పెద్ద మొత్తంలో జరిగే డిజిటల్ చెల్లింపులు, కొత్త డివైజ్ల ద్వారా చేసే లావాదేవీలు కొంత ఆలస్యమవుతాయని అంచనా. అయితే విశ్వసనీయ డివైజ్లు మరియు రోజువారీగా జరిగే చిన్నపాటి చెల్లింపులకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అలాగే బ్యాంకింగ్ యాప్ల ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులు ఇకపై స్క్రీన్షాట్లు తీసుకునే అవకాశం ఉండదని కూడా పేర్కొనబడింది.













.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!